
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మెలియాపుట్టి మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం టిడిపి పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనపాన రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
ఈ సందర్భంగా అనపాన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ:
పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా” కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు అభయ హస్తం లబ్ధిదారులకు నేరుగా నగదు అందించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీలో ఎటువంటి జాప్యం లేకుండా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే సేవలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ గారి సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూర్చేలా కృషి చేస్తున్నామన్నారు.
పాల్గొన్న ఇతర ప్రముఖులు:

ఈ కార్యక్రమంలో అనపాన రాజశేఖర్ రెడ్డి గారితో పాటు మండల తెలుగు యువత అధ్యక్షులు బస్వ పరమేశ్ రెడ్డి, యూనిట్ కో-కన్వీనర్ దుక్క శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే ప్రభుత్వ యంత్రాంగం తరపున గ్రామ సచివాలయ కార్యదర్శి శిష్టు కిషోర్ కుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ E. మోహనకృష్ణ, గ్రామ రెవెన్యూ కార్యదర్శి రాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ముకుందరావు, మరియు ఏఎన్ఎంలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
